కోర్టులో తేల్చుకుందాం: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు చంద్రబాబు

by  |
కోర్టులో తేల్చుకుందాం: సీఐడీ నోటీసులపై హైకోర్టుకు చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అమరావతి రాజధాని భూముల కుంభకోణం వ్యవహారంపై ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, కలెక్టర్ కాంతిలాల్ దండేకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. భూముల కుంభకోణంపై ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు.., చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై నిన్న హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు న్యాయసలహాలు తీసుకున్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు చంద్రబాబు రేపు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు.

Next Story

Most Viewed