- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Telangana Assembly Election 2023
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానాయకుడు, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని నెల్లూరు జిల్లా కావలిలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మేయర్ అజీజ్ శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం వైసీపీ దౌర్జన్యానికి నిదర్శనం అని విమర్శించారు. కావలి డీఎస్పీ ప్రసాదరావు వైసీపీ నేత అవతారమెత్తారని ఎద్దేవా చేశారు. డీఎస్పీ దగ్గరుండి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని బీద రవిచంద్ర ఆరోపించారు.
Next Story