- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చిపోతున్న ఫారెస్ట్ అధికారులు.. బొల్లేపల్లిలో మళ్లీ ‘పోడు’ రగడ
by Batti.Sumithra |
<p>దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామంలో పోడు రగడ మళ్ళీ మొదలైంది. గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న మిరప తోటను ఫారెస్టు అధికారులు ధ్వంసం చేశారు. వేలకు వేలు ఖర్చుపెట్టి నారు పోశామని, ఫారెస్టు అధికారులు వచ్చి వాటిని ధ్వంసం చేశారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కాళ్ల మీద పడ్డ కనికరించలేదని వాపోయారు. గతంలో పలుమార్లు మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం ఫారెస్ట్ అధికారులకు పోడు […]</p>

X
దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లేపల్లి గ్రామంలో పోడు రగడ మళ్ళీ మొదలైంది. గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న మిరప తోటను ఫారెస్టు అధికారులు ధ్వంసం చేశారు. వేలకు వేలు ఖర్చుపెట్టి నారు పోశామని, ఫారెస్టు అధికారులు వచ్చి వాటిని ధ్వంసం చేశారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కాళ్ల మీద పడ్డ కనికరించలేదని వాపోయారు. గతంలో పలుమార్లు మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం ఫారెస్ట్ అధికారులకు పోడు భూముల జోలికి వెళ్లొద్దని చెప్పినా కూడా అధికారులు మాత్రం పట్టించుకోకుండా గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story






