ఫ్లాష్.. ఫ్లాష్.. డీసీసీ అధ్యక్షులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by  |
DCC presidents
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి సమావేశం ముగిసింది. గాంధీభవన్‌లో గురువారం జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్​ మాణిక్కం ఠాగూర్‌తో పాటు రేవంత్, టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా స్థాయిలో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చిందని, ఇక నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమం చేయాలని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు.

టీపీసీసీ నుంచి వచ్చే ఆదేశాలతో పాటు జిల్లా స్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలపై పోరాటం చేయాలన్నారు. దీనిపై డీసీసీ అధ్యక్షులు నిర్ణయం తీసుకోవాలని, వచ్చే వారం నుంచి నిరసన కార్యక్రమాలు ఉంటాయని రేవంత్​రెడ్డి సూచించారు. అనంతరం జిల్లా పార్టీ నేతలతో గాంధీ భవన్​ ఎదుట ఫొటోలు దిగారు.



Next Story

Most Viewed