ఫ్లాష్ ఫ్లాష్ : బీజేపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. కత్తిపోట్లు!

by  |
ysrcp-and-bjp
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప (వైఎస్సార్) జిల్లాలో దారుణం నెలకొంది. గురువారం సాయంత్రం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీలకు చెందని నేతలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.

ఈ ఘటనలో నలుగురు బీజేపీ, ఓ వైసీపీ నేతకు కత్తిపోట్లు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. తీవ్రగాయాలపాలై రక్తస్రావం జరుగుతున్న వ్యక్తులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed