బ్రేకింగ్.. మహారాష్ట్రలో భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం

by  |
బ్రేకింగ్.. మహారాష్ట్రలో భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ధనోరా తాలుక గ్యారబట్టి అటవీప్రాంతంలో కోర్చి పీఎస్ పరిధిలో భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ సంఘటనతో సరిహద్దులో భద్రత సిబ్బంది అ‍ప్రమత్తమయ్యారు. ఎన్‌కౌంటర్‌కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed