గుమ్మా అటవీ ప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

by Batti.Sumithra |   (  Updated:2025-12-25 08:20:27  IST  )

ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లా బెల్గర్ పోలీస్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి.

గుమ్మా అటవీ ప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, భద్రాచలం: ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లా బెల్గర్ పోలీస్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఐదుగురు మావోయిస్టులు ఉన్నారు. మృతి చెందిన వారిని ఏసీఎం బారి, బీపీఎం అమరిత్‌గా గుర్తించారు. వీరంతా మావోయిస్టులకు అవసరం అయ్యే వస్తువులు సరఫరా చేసే టీమ్‌గా గుర్తించారు. ఈ మేరకు వారి నుంచి ఒక రివాల్వర్, ఒక 303 రైఫిల్, వాకీ‌టాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన వారిలో ఇద్దరి పై రూ.23.65 లక్షల రివార్డు ఉన్నట్లుగా పోలీసు అధికారులు వెల్లడించారు.

Next Story