మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఐదుగురు మృతి..

by  |
మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఐదుగురు మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో అక్కడ వైన్ షాపులను మూసివేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని వాణి పట్టణంలో మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో దత్త లింగేశ్వర్, గణేశ్ షెలార్, సునిల్ ధేంగలే, నూతన్ పతార్కర్ నిన్న అర్ధరాత్రి శానిటైజర్ తాగారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు.



Next Story

Most Viewed