కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

by  |
కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లా చెల్లానమ్ ట్రైబల్ ఏజెన్సీ వలయార్‌ గిరిజనకాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు అందర్నీ హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరించారు. సమాచారం అందకున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు.

అనంతరం ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం మద్యం శాంపిళ్లను సేకరించారు. అయితే మద్యం సేవించిన వారంతా ఓ వ్యక్తి అంత్యక్రియలకు వచ్చిన బంధువులుగా పోలీసులు గుర్తించారు. కాగా అస్వస్థతకు గురైన తొమ్మిదిమందిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా మద్యంలో శానిటైజర్ కలిపారని సంబంధిత వ్యక్తి ఒకరు పోలీసులు సమచారం ఇచ్చారు.



Next Story

Most Viewed