మైనర్ బాలిక అత్యాచార ఘటనలో ఐదుగురు అరెస్ట్..

by  |
minor-girl-raped
X

దిశ, గద్వాల : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన వ్యక్తిని, అందుకు సహకరించిన మరొక నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు గురువారం తరలించిన సంఘటన దరూర్ పోలీసుల పరిధిలో జరిగింది. వివరాలలోకి వెళితే.. దరూర్ మండలంలోని గ్రామానికి చెందిన మైనర్ బాలికను గత నెల 28వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో, నరేందర్ అనే ప్రక్క గ్రామానికి చెందిన వ్యక్తి తన స్నేహితులు అయిన దివాకర్, శేషు, ప్రభాకర్, రాజుల సహకారం తో ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి ఒక కారు, రెండు బైక్ ల సహాయంతో గ్రామం నుండి వెళ్లారు.

పలు ప్రాంతాలలో మైనర్ బాలికను తమ వెంట తిప్పుకుని హత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు మైనర్ బాలిక ఆచూకీ కనుగొని బాలికను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నేరానికి పాల్పడిన నరేందర్‌ను, అందుకు సహాయ సహకారాలు అందించిన అతడి స్నేహితులు నలుగురిని గద్వాల్ సీఐ ఆధ్వర్యంలో దరూర్ ఎస్సై రమా దేవి, సిబ్బంది అరెస్ట్ చేశారు. వారి నుండి ఒక కారు, రెండు బైక్ లను, 5 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


Next Story

Most Viewed