ఆ ఇంట్లోకి ఎవరు రారనుకున్నారు కానీ, పోలీసులొచ్చారు.. ఐదుగురు అరెస్టయ్యారు

by  |
playing-cards1
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని శివలింగపురం ప్రాంతంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సమయంలో శివలింగపురం ప్రాంతంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న తాత వెంకటరమణ, అడపా వెంకటేశ్వర్లు, సలుగు భిక్షపతి, నంబుజి శ్రీనివాస్ రావు, స్వగ్గరి రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 44,489 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed