హర్యానాలో కాల్పులు..ఐదుగురు మృతి

by  |
హర్యానాలో కాల్పులు..ఐదుగురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: హర్యానాలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. రోహతంగ్ లోని ఓ రెజ్లింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు రెజ్లింగ్ కోచ్, మూడేండ్ల బాలుడు ఉన్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే రెజ్లింగ్ కోచ్ ల మధ్య విభేదాలే కాల్పులకు దారి తీసాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.

Next Story