సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి!

by  |
సరిహద్దులో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మల్కన్ గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. తిరిగి పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా, గాయపడిన మావోయిస్టులు వైద్యం చేయించుకునేందుకు వస్తున్నారని తెలిసి వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed