పార్లమెంటు భవనంలో అగ్నిప్రమాదం

by  |
పార్లమెంటు భవనంలో అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ఆరో అంతస్థులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా, పార్లమెంటు సమావేశాల నిర్వహణ కోసం ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పార్లమెంటు భవనంలో కరోనా నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు లోక్ సభ, రాజ్యసభలతోపాటు ఖాళీగా ఉన్న ఆవరణలనూ ఉపయోగించుకునేందుకు ప్లాన్ చేసుతున్నారు. తగిన విధంగా సౌండ్ సిస్టమ్, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో అగ్నిప్రమాదం జరగడం కొసమెరుపు.



Next Story