అగ్నిప్రమాదం.. ఐసీయూలో చెలరేగిన మంటలు

by  |
అగ్నిప్రమాదం.. ఐసీయూలో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. జీజీహెచ్ ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది మంటలను అదుపు చేయగా.. షార్ట్‌ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మంటలు చెలరేగిన వార్డులో పేషంట్లు లేనట్లు సమాచారం. ఐసీయూ ఉన్న అంతస్తు నుంచి పేషంట్లను వేరే దగ్గరకు షిష్ట్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. రోగులు సురక్షితంగా బయట పడ్డారు.



Next Story