మిషన్ భగీరథ స్టోర్ రూమ్‌లో భారీ అగ్నిప్రమాదం

by  |
మిషన్ భగీరథ స్టోర్ రూమ్‌లో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, హుజురాబాద్: మిషన్ భగీరథ పరికరాలు ఉంచిన గదిలో ఒక్కసారి మంటలు చెలరేగాయి. సుమారుగా రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్న పాత గదుల్లో మిషన్ భగీరథ పరికరాలు ఉంచారు.

శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాచ్ మెన్ కంపెనీకి సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వడంతో కంపెనీ అధికారులు ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారుగా రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వెల్కో కంపెనీ ఇంఛార్జ్ నోపాల్ రెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed