అర్ధరాత్రి అగ్ని ప్రమాదం… ముగ్గురు సజీవ దహనం

by  |
అర్ధరాత్రి అగ్ని ప్రమాదం… ముగ్గురు సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలోని కల్యాణ్‌పూర్ పరిధిలోని ఛక్కన్ టోలీ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఒక ఇంటికి నిప్పంటుకోగా.. భారీగా మంటలు వ్యాపించాయి. గాలికి మంటలు పలు ఇళ్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. సంగహ్త్నా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు

Next Story

Most Viewed