దేవినేని ఉమాపై కేసు నమోదు

by  |
దేవినేని ఉమాపై కేసు నమోదు
X

దిశ, వెబ్‎డెస్క్:మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై కేసు నమోదు అయింది. బుధవారం జక్కంపూడిలో నిర్మించిన TIDCO గృహాలను పరిశీలించేందుకు దేవినేని ఉమా వెళ్లారు. ఈ క్రమంలో దేవినేనితో షాబాద్‌ గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దేవినేని ఉమ తమను బెదిరించారంటూ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవినేని ఉమపై ఐపీసీ 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story