దేశంలో తొలిసారిగా డిజిటల్ జనాభా లెక్కలు

by  |
దేశంలో తొలిసారిగా డిజిటల్ జనాభా లెక్కలు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఏటా పదేండ్లకొకసారి నిర్వహించాల్సిన జనాభాలెక్కలు కరోనా కారణంగా ఈసారి ఆలస్యమైన విషయం తెలిసిందే. అయితే, సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 2021 జనాభా లెక్కలు డిజిటల్ రూపంలో జరనున్నాయని తెలిపారు. అందుకోసం ప్రత్యేకంగా రూ.3700కోట్లను కేంద్రం కేటాయించిందని వెల్లడించారు.

కాగా, 2019 ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గత మార్చి నెలలో దేశంలో కరోనా వైరస్ ప్రవేశించడంతో ఆ ప్రక్రియను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది.ఇదిలాఉండగా 2011 సెన్సస్ ప్రకారం ఇండియా జనాభా 120 కోట్లు ఉండగా, 2021లో చైనా జనాభాను మనదేశం క్రాస్ చేయనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed