‘అందుకే కేంద్రమంత్రి రాజీనామా చేశారు’

by  |
‘అందుకే కేంద్రమంత్రి రాజీనామా చేశారు’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రైతుల గురించి ఎక్కవగా ఆలోచించేంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని, మాది రైతు ప్రభుత్వం అని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నామని, పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నామని అన్నారు.

బీజేపీ రైతు వ్యతిరేక విధానం నచ్చకే కేంద్ర మంత్రి రాజీనామా చేశారని స్పష్టం చేశారు. ఏడు లక్షల మంది ఆడపిల్లల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విపత్కర పరిస్థితుల్లోనూ, రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదని అన్నారు. రైతుల మేలు కోసమే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ల్లడించారు.


Next Story

Most Viewed