- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటుకు నోటు కేసులో తుది తీర్పు ఖరారు!
<p>దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు తుది తీర్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో తమ పేర్లను తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహా డిశ్చార్జి పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బధవారం కేసును విచారించిన ఏసీబీ న్యాయస్థానం డిశ్చార్జి పిటిషనర్ల వాదనలు విన్నది. ఇక వాదనలు ముగిసిన క్రమంలో నవంబర్ 2న తుది తీర్పు ఇస్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. కాగా, […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు తుది తీర్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో తమ పేర్లను తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహా డిశ్చార్జి పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బధవారం కేసును విచారించిన ఏసీబీ న్యాయస్థానం డిశ్చార్జి పిటిషనర్ల వాదనలు విన్నది. ఇక వాదనలు ముగిసిన క్రమంలో నవంబర్ 2న తుది తీర్పు ఇస్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. కాగా, 2015లో జరిగిన మహానాడులో పెద్ద కుట్ర జరిగిందని ఏసీబీ కోర్టుకు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇరువురి వాదనలను విన్న కోర్టు తుది తీర్పును నవంబర్ 2వ తేదీన వెల్లడించనుంది. ఈ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.
Next Story






