ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే‌పై కేసు నమోదు

by  |
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే‌పై కేసు నమోదు
X

దిశ, రంగారెడ్డి: యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ మధ్య వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీపీ సుకన్య సదరు ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యాచారం పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి, సీఐ గురువా రెడ్డిలపై కేసు నమోదు అయ్యింది. వీరిపై సెక్షన్ 509 ఐపీసీ, సెక్షన్ 3(1)(R) ఎస్సీ, ఎస్టీ, పీఓఏ యాక్ట్ 2015, 323 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed