ప్రణయ్ హత్య: రాంగోపాల్‌వర్మపై కేసు నమోదు

by  |
ప్రణయ్ హత్య: రాంగోపాల్‌వర్మపై కేసు నమోదు
X

దిశ, నల్లగొండ: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణలపై మిర్యాలగూడ వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. మర్డర్ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణలపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు.



Next Story

Most Viewed