స్టేషన్ ముందే రక్తం వచ్చేలా కొట్టుకున్నారు.. పోలీసులు ఏం చేస్తున్నారంటే. వీడియో

by  |
స్టేషన్ ముందే రక్తం వచ్చేలా కొట్టుకున్నారు.. పోలీసులు ఏం చేస్తున్నారంటే. వీడియో
X

దిశ, గోదావరిఖని : పోలీసుల సాక్షిగా ఇరువర్గాలు కొట్టుకున్నారు. ఇదేమీ మొదటిసారి కాదు. కోల్‌బెల్ట్‌ ఏరియాలోనే అతి పెద్ద పోలీస్ స్టేషన్ అయిన గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రక్తం కారే విధంగా వారు తన్నుకున్నారు. గోదావరిఖని గణేష్ నగర్‌కు చెందిన అసరి రాజుకు ద్వారకనగర్‌కు చెందిన దాక్షాయణికి ఏడాది క్రితం వివాహం జరిగింది. మూడురోజుల క్రితం దాక్షాయణికి కుమారుడు జన్మించగా ఆసుపత్రి వద్ద భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.

ఈ పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ బయట మాట్లాడుకోవాలని సూచించారు. బయటకు వచ్చిన ఇరువర్గాలు పోలీసుల ముందే రాళ్లతో కొట్టుకున్నారు. ఈ దాడిలో రమేష్, అజయ్ అనే వ్యక్తులు గాయపడ్డారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో ఫిర్యాదులు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన బాధితులు పరుగులు తీశారు. గత జూన్ 18న కూడా పంచాయితీలో ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. అప్పట్లో కూడా పోలీసులు పేక్షకపాత్ర వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వల్లనే ఇలా జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

Next Story

Most Viewed