మంత్రి ఇలాకాలో.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

by  |
మంత్రి ఇలాకాలో.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, బాల్కొండా: మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి సొంత మండలంలో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరి పంట నష్టం వాటిల్లింది. దీంతో మండలంలోని పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు తీవ్ర మనస్తాపానికి గురై పొలం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న గ్రామస్తులు ఆమెను అడ్డుకోవడంతో ప్రాణపాయం తప్పింది. ఈ సంఘటనతో అక్కడ ఉన్న రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.


Next Story

Most Viewed