షాకింగ్.. అర్ధరాత్రి నైటీలో వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై..

by  |
షాకింగ్.. అర్ధరాత్రి నైటీలో వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై..
X

దిశ, మహబూబాబాద్: ఇంటికి తాళంవేసి ఊరు వెల్లుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నే గ్రామ శివారు ముత్యాలమ్మ తండా, ఇంటికన్నే స్టేషన్ తండా‌లో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తండాకు చెందిన దరావత్ కవిత, బానోతు రామ బాలు, చంద్రు, భూక్య లింగమ్మ ఇంట్లో చోరీ చేశారు.

ముత్యాలమ్మ తండాకు చెందిన భూక్య లింగమ్మ ఇంటిలోని నైటీ దుస్తులు దొంగిలించారు. మరో ఇంటి తాళం పగలగొట్టి , ఆ ఇంటిఎదుట ఖర్జురా ప్యాకెట్ వదిలి వెళ్లారు. ఏదో దుకాణంలో చోరీ చేసి తండా‌కు వచ్చి ఉంటారని తండా వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇదే తండాలో నిద్రిస్తున్న మహిళ గొంతు నొక్కి పట్టి మెడలో పుస్తలతాడు కోసం వెతికారు. వెంటనే ఆ మహిళ అరుపులు, కేకలు వేయగా దొంగ సైకిల్ తొక్కుంటూ పరారయ్యారు. ఇదిలా ఉండగా పురుషులే మహిళలు ధరించే నైటీ దుస్తులు ధరించి దొంగతనాలకు వచ్చారని తెలిపారు. ఈ విషయమై కేసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.


Next Story

Most Viewed