ఆడపిల్లల గొంతులు కోసిన తండ్రి..!

by  |
ఆడపిల్లల గొంతులు కోసిన తండ్రి..!
X

దిశ, వెబ్‌డెస్క్ : సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కూతుళ్లపై ఓ తండ్రి కర్కషంగా ప్రవర్తించాడు. ఇంట్లో గొడవల కారణంగా తన ఇద్దరు కూతుళ్లను చంపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగింది. వివరాళ్లోకి వెళితే… మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో మహ్మద్ అనే వ్యక్తి మటన్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి తీవ్రంగా బానిస అయ్యాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. అంతేగాకుండా గ్రామస్తుల పట్ల కూడా సైకోలాగా ప్రవర్తించడంతో ఊరి నుంచి వెళ్లగొట్టారు.

దీంతో దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ ఇళ్లు కిరాయికి తీసుకొని, జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కూడా తాగొచ్చి ఇంట్లో గొడవ పడ్డారు. ఈ సందర్భంగా తీవ్ర ఆవేశానికి లోనైన మహ్మద్ తన ఇద్దరు కూతుళ్లపై కత్తితో దాడి చేసి, గొంతు కోసాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న భూంపల్లి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఓ కానిస్టేబుల్‌పై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. అనంతరం నిందితున్ని పట్టుకొని, చితక్కొట్టి, అదుపులోకి తీసుకున్నాడు. అనంతరం చిన్నారులను అంబులెన్సు ద్వారా స్థానిక సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా గత 15 ఏండ్ల క్రితం మహ్మద్ మహారాష్ట్ర నుంచి మిరుదొడ్డి మండలం మోతే గ్రామానికి వలస వచ్చినట్టు సమాచారం.

Next Story