- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, రాజేంద్రనగర్ : అభం శుభం తెలియని రెండు నెలల బాబును డబ్బుల కోసం అమ్ముకున్నాడో కన్న తండ్రి. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో నివసించే సయ్యద్ హైదర్, షహనాజ్ బేగం భార్య భర్తలు. వీరికి రెండు నెలల కిందట మగ పిల్లాడు జన్మించాడు. రంజాన్ మాసం కావడంతో ఈనెల 15వ తేదీన షహనాజ్ బేగం ఇంట్లో నమాజ్ చేసుకుంటూ ఉండగా, ఇదే అదనుగా భావించిన సయ్యద్ హైదర్ రెండు నెలల బాబు ఆడిపిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు.
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సయ్యద్ హైదర్ ఒక్కడే ఇంటికి రావడంతో తన బాబు ఎక్కడ ఉన్నాడని సయ్యద్ హైదర్ను భార్య షహనాజ్ బేగం నిలదీయగా రూ.30 వేలకు చిన్నారిని విక్రయించినట్లు సయ్యద్ హైదర్ తన భార్యతో చెప్పాడు. దీంతో షహనాజ్ బేగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడే బాబును తీసుకు వస్తానని చెప్పిన సయ్యద్ హైదర్ అక్కడి నుండి పరారయ్యాడు. అనంతరం తన భర్త సయ్యద్ హైదర్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని భార్య షహనాజ్ బేగం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.