దారుణం: భార్య అలా చేసిందని.. 8నెలల పసిబిడ్డను దానికేసి కొట్టి

by  |
దారుణం: భార్య అలా చేసిందని.. 8నెలల పసిబిడ్డను దానికేసి కొట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తు.. మనషుల చేత ఎంతటి దారుణాన్ని అయినా చేయిస్తుంది. ఆ మత్తులో తూలేవారికి తల్లి, చెల్లి, భార్య, బిడ్డ అనే విచక్షణ ఉండదు. తాజాగా మద్యం మత్తులో సొంత కూతురిని నేలకేసి కొట్టి చంపాడో కిరాతక తండ్రి. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. బిజ్నోర్ జిల్లా మండవలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రహత్‌పూర్ ఖుర్ద్ గ్రామంలో మహ్మద్ నజీమ్ అనే వ్యక్తికి ఖుర్ద్ గ్రామానికి చెందిన మహతాబ్ జహాన్‌ తో 18 నెలల క్రితం వివాహం అయ్యింది. వారికి ఎనిమిది నెలల కూమార్తె ఉంది.

అయితే.. మొదటి నుంచి మహ్మద్ నజీమ్ మద్యం అలవాటు ఉండడంతో పెళ్లి తర్వాత కూడా అతను రోజు తాగి వచ్చి భార్యను హింసించేవాడు. బిడ్డ పుట్టాకైనా భర్త మారతాడేమో అని ఎదురుచూసిన ఆమెకు నిరాశే మిగిలింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె చిన్నారిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా కాపురానికి రాకపోవడంతో భర్త మహ్మద్ నజీమ్ అత్తవారింటికి ఫుల్లుగా తాగేసి వెళ్లి వారితో గొడవ పెట్టుకునేవాడు.

ఇక ఈ క్రమంలోనే జూలై 31 న భార్య ఇంటికి వెళ్లి కాపురానికి రమ్మని అడిగాడు. ఆమె రాను అని ఖరాఖండీగా చెప్పడంతో తన బిడ్డను తనకు ఇచ్చేయమని డిమాండ్ చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం పెరిగింది. భార్యపై కోపంతో రెచ్చిపోయిన మహ్మద్ నజీమ్ పక్కనే మంచంపై నిద్రిస్తున్న కుమార్తెను నేలకేసి చనిసోయే దాక కొట్టాడు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పాప చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇటీవల పరారీలో ఉన్న మహ్మద్ నజీమ్ ని వెతికి అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed