గదిలో కూతురితో ఉన్న లవర్.. వారిద్దరిని అలా చూసి తండ్రి ఏం చేశాడంటే..?

by  |
Murder
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో యువత పెడదారి పడుతున్నారు. అందుకు సినిమాలు, మొబైల్స్, సోషల్ మీడియానే కారణంగా తెలుస్తోంది. 24 గంటలు యువత వీటిపైనే ఉంటుండటంతో మంచి ఏమో కానీ విద్యార్థులపై చెడు ప్రభావమే ఎక్కువగా పడుతున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. కొందరు పిల్లలతే ఏకంగా పోర్న్ సైట్స్ ఓపెన్ చేస్తున్నారని తెలుస్తోంది. తల్లితండ్రుల పర్యవేక్షణ కరువు కావడమే పిల్లలు ఇలా పెడదారిన పట్టడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతోందని నిపుణులు చెబుతున్నారు. మైనార్టీ తీరకముందే లవ్ ఎఫైర్స్, మొబైల్ చాటింగ్స్, వీడియో కాల్స్, పేరెంట్స్ లేని టైంలో ఏకంగా గుట్టుగా ఇంట్లో కలుసుకోవడాలు కూడా చేస్తున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో వెలుగుచూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురు ప్రియుడితో ఉండటాన్ని చూసిన ఆ తండ్రి తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకివెళితే.. బెంగళూరులో ఆటోరిక్షా నడుపుతూ నారాయణ్(46) అనే వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి ఒక కూతురు. చదువుకుంటోంది. ఈ క్రమంలోనే ఓ రోజు తండ్రి ఇంట్లో లేని సమయం చూసి కూతురు ఏకంగా తన ప్రియుడితో మకాం పెట్టింది. అదే టైంలో సడెన్‌గా తండ్రి వచ్చాడు. గదిలో కూతురితో కలిసియున్న నివేశ్ కుమార్ అనే కుర్రాడిని పట్టుకున్నాడు. పక్కనే ఉన్న లావుపాటి కర్రతో అతన్ని చితకబాదాడు నారాయణ్. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ కుర్రాడు మృతి చెందాడు. నివేశ్ కుమార్, నారాయణ్ కూతురు ప్రేమించుకుంటున్నారని, మృతుడు కూడా అమ్మాయి ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed