కుమారులను కాల్చి.. తాను కాల్చుకుని

by  |
కుమారులను కాల్చి.. తాను కాల్చుకుని
X

కుమారుల పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఇద్దరు కుమారులను తుపాకీతో కాల్చి, తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన మూల్‌చంద్ ద్వివేదీ(50) ఈ ఘోరానికి ఒడిగట్టాడు. స్థానికంగా ఉండే బొగ్గు కంపెనీలకు, సిమెంట్ ఫ్యాక్టరీలకు మూల్ చంద్ సెక్యూరిటీ సిబ్బందిని సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో గొడవ జరిగింది. అది కాస్తా ముదరడంతో ఒకరిపై ఒక్కరు వాదులాడుకున్నారు. దీంతో పట్టలేని ఆగ్రహంతో మూల్చంద్ తన ఇద్దరు కుమారులు ఆకాశ్(22), పవన్(20)లపై లైసెన్స్ తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూల్ చంద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆకాశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. మరో కుమారుడు పవన్ ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags: father, sons, firing, balharshah, crime news, maharashtra

Next Story

Most Viewed