షాకింగ్ న్యూస్.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, ఉరి వేసుకున్న తండ్రి.. చివరకు..

by  |
షాకింగ్ న్యూస్.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, ఉరి వేసుకున్న తండ్రి.. చివరకు..
X

దిశ, దామరచర్ల : కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులతో సహా ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి.. తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం నునావత్ తండాలో గురువారం రాత్రి జరిగింది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో గేర్ కిషన్(34) అనే వ్యక్తి ఇద్దరు పిల్లలు హర్షవర్ధన్(8), అఖిల్ (6)తో కలిసి గ్రామ శివారులోని పంట పొలాల వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. గేర్ కిషన్ ఉత్తర తెలంగాణ వాసి.. అయితే ఇల్లరికం అల్లుడిగా నునావత్ తండాకు వచ్చి తనకున్న ఏకరంన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లల చదువుకు ఇబ్బందిగా ఉండటంతో ప్రతిరోజూ ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కొద్దిరోజుల నుండి భార్యాభర్తలు తరుచూ గోడవపడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను తీసుకొని గ్రామ శివారులో పంట పొలాలకు వెళ్లే మార్గంలో వారికి కల్లు త్రాగించాడు. అనంతరం షాప్‌లో మజా కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని.. దానిలో పురుగుల మందును కలిపి పిల్లలతో త్రాగించాడు. కొద్దిసేపటికే పిల్లలు అపస్మారక స్థితికి వెళ్లగానే.. తాను చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Next Story