ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా

by  |
ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా
X

శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్, ఎంపీ, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కరోనా బారినపడ్డారు. ఫరూఖ్ అబ్దుల్లా తనయుడు ఒమర్ అబ్దుల్లా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘మా నాన్నకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొన్ని వైరస్ లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. అందుకే కుటుంబ సభ్యులతోపాటు నేను కరోనా టెస్టు చేసుకునే వరకు సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్తున్నాను. ఇటీవలి కాలంలో మాతో కాంటాక్ట్‌లోకి వచ్చినవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed