ఆగ్రహంలో అన్నదాతలు.. మంథని టు గోదావరిఖని రోడ్డు బ్లాక్

by  |
ఆగ్రహంలో అన్నదాతలు.. మంథని టు గోదావరిఖని రోడ్డు బ్లాక్
X

దిశ, మంథని : కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో తమ పంటలు మునిగిపోయాయని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం మంథని టు గోదావరిఖని ప్రధాన రహదారి సిరిపురం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికీ మూడు సార్లు తమ పంటలు బ్యాక్ వాటర్ వలన నష్టపోయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారు గంట పాటు రైతులు ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో మంథని ఎస్‌ఐ చంద్ర కుమార్ ఘటనా స్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సాయంత్రంలోగా సర్వే జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.



Next Story

Most Viewed