కేజీఎఫ్ హీరో తల్లిపై పోలీసులకు ఫిర్యాదు

by  |
కేజీఎఫ్ హీరో తల్లిపై పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, సినిమా: కేజీఎఫ్ హీరో యశ్ తల్లి పుష్పలతపై ఫైర్ అవుతున్నారు కర్ణాటక హాసన్ జిల్లా తిమ్మాపూర్ గ్రామస్తులు. యశ్ స్వగ్రామం హాసన్ కాగా.. సమీపంలోని తిమ్మాపూర్‌లో ఇటీవల 80 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అయితే యశ్ తల్లి ఈ భూమి అంతటికీ కంచె వేయించడంతో తమ పొలాలకు వెళ్లేందుకు దారి లేదంటూ ఆందోళనకు దిగారు గ్రామస్తులు. ఎన్నిసార్లు అడిగినా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దుద్ద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు.

ఈ మేరకు ఇరు వర్గాలతో చర్చించేందుకు పోలీసులు నిర్ణయించగా.. అక్కడికి చేరుకున్నారు యశ్. కాగా గ్రామ పటంలో ఉన్నట్లు తమకు దారి ఇవ్వాలని, 80 ఏకరాలకు కంచె వేస్తే తమ భూములు ఎలా సాగు చేసుకుంటామని ప్రశ్నించారు రైతులు. కాగా యశ్ రాకతో అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు.


Next Story

Most Viewed