అల్వాల్ రైతు వెంకట్ రెడ్డికి ‘పద్మ శ్రీ’ పురస్కారం..

by  |
అల్వాల్ రైతు వెంకట్ రెడ్డికి ‘పద్మ శ్రీ’ పురస్కారం..
X

దిశ, అల్వాల్​ : సేంద్రీయ పద్ధతులు, మట్టితో తయారుచేసిన సహజమైన ఎరువులతో గత 20 ఏండ్లుగా ఆయన ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు అల్వాల్‌కు చెందిన చింతల వెంకట్​రెడ్డి. ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా వరి, గోధుమలతో పాటు అనేక పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఈ నేపథ్యంలోనే ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం వెంకట్ రెడ్డిని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. కరోనా మహమ్మారి మూలంగా ఏడు నెలల కిందట అందుకోవాల్సిన అవార్డును సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు వెంకట్ రెడ్డి. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణ రైతులకు దక్కిన గౌరవంగా స్థానికులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed