- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని బంటుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అప్పాజిపేటలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తంగిళ్ల యాదగిరి రెడ్డి తనకున్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, అదే సమయంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. గతకొంత కాలంగా యాదగిరి రెడ్డికి తన బంధువులతో భూ వివాదాలు ఉన్నాయి. ఈ మధ్యనే కుమార్తె పెళ్లి చేసి అప్పుల పాలైనట్లు సమాచారం. ఈ రెండు సమస్యలతో తీవ్ర మనస్థాపానికి గురైన యాదగిరి రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున కొళ్లఫారం వద్ద పురుగుల మందు తాగాడు. స్థానిక రైతులు గమనించగా అప్పటికే యాదగిరి రెడ్డి మృతి చెందాడు. దీంతో వారు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. యాదగిరి రెడ్డి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.