- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
![ఆ బాధ భరించలేక రైతు ఆత్మహత్య ఆ బాధ భరించలేక రైతు ఆత్మహత్య](https://www.dishadaily.com/wp-content/uploads/2021/09/suicide-11.jpg)
దిశ, నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఏదో ఒక జిల్లాలో ఇటువంటి విషాద ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అప్పుల బాధ తాళలేక ఓ రైతు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం పాపగల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వస్పరి నాగయ్య (42) తనకున్న 5 ఎకరాల్లో పత్తి, వరి పంట సాగు చేశాడు. మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందుకు సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడు.
గత మూడేళ్ళుగా ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరిగాయి. ఈ సారి సాగుచేసిన వరి పంటను కూడా కొనము అని ప్రభుత్వం చెప్పడంతో అప్పుల వారు ఒత్తిడి పెంచారని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకెళ్లిన నాగయ్య.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మంగళవారం పొలంవద్దకు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించారని కుటుంబీకులు కన్నీరుపెట్టుకున్నారు. రైతు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు.