‘జిందగీ న మిలేగి దొబారా’.. ఈ సారి ఫిమేల్ వెర్షన్!

by  |
‘జిందగీ న మిలేగి దొబారా’.. ఈ సారి ఫిమేల్ వెర్షన్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ మూవీ ‘జిందగీ న మిలేగి దొబారా’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ముగ్గురు స్నేహితులు కలిసి చేసిన స్పెయిన్ ట్రిప్.. జీవితంతో ప్రేమలో పడేందుకు, వారి లోపల ఉన్న భయాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు అవకాశంగా మారుతుంది. ఫ్రెండ్‌షిప్, లవ్, లైఫ్, వాల్యూస్ గురించి వివరించే ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కత్రినా కైఫ్ ప్రధానపాత్రల్లో కనిపించగా జోయా అక్తర్ దర్శకత్వం వహించారు.

కాగా ఈ చిత్రానికి ఫిమేల్ వెర్షన్ రాబోతున్నట్లు బీటౌన్ టాక్. అలియా భట్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లతో మూవీని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ‘రోడ్ ట్రిప్ సాగా’గా వస్తున్న చిత్రానికి ఈసారి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించబోతుండగా.. జోయా అక్తర్, ఫర్హాన్ అక్తర్ కలిసి స్టోరీ డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా.. ఫర్హాన్ ఈ లోపు యాక్టర్‌గా కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను కంప్లీట్ చేయనున్నాడు. ‘డాన్ 2’ తర్వాత తను డైరెక్ట్ చేయబోతున్న సినిమా ఇదే కాగా దాదాపు పదేళ్ల తర్వాత డైరెక్టర్ కుర్చీలో కూర్చోబోతున్నాడు.


Next Story

Most Viewed