ముగ్గురి అనుమానాస్పద మృతి..

by Batti.Sumithra |

<p>దిశ,వెబ్‌డెస్క్ ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఈఘటన ఒడిశాలోని గంజాం జిల్లా పాలియా ఛత్రపురంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..ఒకే కుటుంబంలోని దంపతులు, వారి కూతురు అనుమానాస్పదంగా మృతిచెందారు. భర్త ఇంట్లోని పైకప్పుకు ఉరేసుకుని వేలాడుతుండగా, తల్లి, కూతురు అచేతన స్థితిలో నేలపై పడి ఉన్నారు. గమనించిన ఇరుగుపొరుగు వెంటనే పోలీసులకు,బంధువులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిది ఆత్మహత్యా లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు [&hellip;]</p>

దిశ,వెబ్‌డెస్క్
ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఈఘటన ఒడిశాలోని గంజాం జిల్లా పాలియా ఛత్రపురంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..ఒకే కుటుంబంలోని దంపతులు, వారి కూతురు అనుమానాస్పదంగా మృతిచెందారు. భర్త ఇంట్లోని పైకప్పుకు ఉరేసుకుని వేలాడుతుండగా, తల్లి, కూతురు అచేతన స్థితిలో నేలపై పడి ఉన్నారు. గమనించిన ఇరుగుపొరుగు వెంటనే పోలీసులకు,బంధువులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిది ఆత్మహత్యా లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Next Story