కరోనా కాటుకు కుటుంబం బలి.. రైలు కింద తలపెట్టి..

by Batti.Sumithra |   (  Updated:2021-04-19 05:31:31  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా ధాటికి ఓ కుటుంబం బలైంది. కరోనాతో కుటుంబంలోని ఓ వ్యక్తి, ఆయన తల్లి కరోనా కారణంగా మరణించారు. తన భర్త, అత్త మరణాన్ని తట్టుకోలేక సదరు మహిళ.. తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగళూరు ఉత్తర తాలూక, సోమశెట్టిహళ్లి ప్రాంతంలో రేఖ అనే మహిళ తన కుటుంబంతో ఉంటోంది. అయితే, గత ఏడాది ఆమె భర్త శివరాజ్​కరోనా సోకి [&hellip;]</p>

కరోనా కాటుకు కుటుంబం బలి.. రైలు కింద తలపెట్టి..
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలోని బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా ధాటికి ఓ కుటుంబం బలైంది. కరోనాతో కుటుంబంలోని ఓ వ్యక్తి, ఆయన తల్లి కరోనా కారణంగా మరణించారు. తన భర్త, అత్త మరణాన్ని తట్టుకోలేక సదరు మహిళ.. తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగళూరు ఉత్తర తాలూక, సోమశెట్టిహళ్లి ప్రాంతంలో రేఖ అనే మహిళ తన కుటుంబంతో ఉంటోంది.

అయితే, గత ఏడాది ఆమె భర్త శివరాజ్​కరోనా సోకి మరణించారు. శివరాజ్‌కు కరోనా సోకిన అనంతరం, ఆయన తల్లి శివాంభిక కూడా కరోనాతో మృతి చెందింది. వారద్దరి మరణం కారణంగా.. ఆమె, కుమారుడు మనోజ్​తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే వారద్దరూ.. రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు.

Next Story