పెద్దకొడుకు చేసిన పని తట్టుకోలేక తల్లిదండ్రులు.. ?

by  |
పెద్దకొడుకు చేసిన పని తట్టుకోలేక తల్లిదండ్రులు.. ?
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా వుత్తూరు మండలం రాచపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రాచపాలెంకు చెందిన దంపతులు.. కుమారుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తన పెద్ద కుమారుడు అప్పులు చేయడంతో మనస్తాపం చెంది వారు, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు తెలిపారు. మృతులు శంకరయ్య (55), గురవమ్మ (45), వినయ్‌ (25)గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు తీసుకోవడంతో గ్రామంలో విషాదంఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed