దొంగనోట్ల కలకలం: కూరగాయలమ్మే మహిళకు అనుమానం

by  |
దొంగనోట్ల కలకలం: కూరగాయలమ్మే మహిళకు అనుమానం
X

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలో దొంగనోట్లు కలకలం రేగాయి. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో దొంగనోట్లు మారుస్తూ.. ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. కూరగాయలు అమ్మే మహిళలకు అనుమానం రావడంతో దొంగనోట్ల మోసం బయటపడింది. దీంతో స్థానికుందరూ కలిసి ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొంత మంది ఆక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్ల వ్యాపారానికి తెరలేపిన్నట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed