ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు

by  |
Inter Board
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈనెల 31వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, కో ఆపరేటీవ్, టీఎస్ సాంఘీక సంక్షేమం, గిరిజ సంక్షేమ గురుకులతో పాటు ఇంటర్మీడియట్ కోర్సును అందజేస్తున్న మోడల్, బీసీ వెల్పేర్, కేజీబీవీ, జూనియర్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ విధిగా విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సూచించారు. ప్రైవేటు కళాశాలలు తప్పని సరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story