అగ్రీ యూనివర్సిటీలో అడ్మిషన్ గడువు పొడగింపు: వీసీ

by  |
Agricultural University,
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటిలో డిప్లమా కోర్సుల ఆన్ లైన్ అడ్మిషన్ గడువును పొడిగించారు. పాలిటెక్నిక్ లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 28 వరకు అడ్మిషన్‌కు అవకాశం కల్పించామని వీసీ ప్రవీణ్ రావు ప్రకటించారు. పాలీసెట్ అగ్రిస్ట్రీమ్ ర్యాంక్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు కేటాయించామని వెల్లడించారు. మిగిలిన 40 శాతం సీట్లను పాలిసెట్ మెరిట్ ర్యాంక్ ఆధారంగా కేటాయిస్తామని ఈ కోటాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తామని వివరించారు. సెప్టెంబర్ మొదటి వారంలో కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

Next Story

Most Viewed