- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: పెట్రోలియం, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాల వస్తువుల ఎగుమతులు తగ్గిపోవడంతో జూన్ నెలలో భారత ఎగుమతులు 12.41 శాతం తగ్గి రూ. 1.64 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు జూన్లో 47.59 శాతం పడిపోయి రూ. 1.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే నెలలో 1.14 లక్షల కోట్ల లోటుతో పోలిస్తే 59 వేల కోట్ల్ వాణిజ్య మిగులు నమోదైంది. ఏప్రిల్-జూన్ మధ్య ఎగుమతులు 36.71 శాతం తగ్గి రూ. 3.84 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులు 52.43 శాతం తగ్గి రూ. 4.53 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో వాణిజ్య లోటు రూ. 68.4 వేల కోట్లు. చమురు దిగుమతులు జూన్లో 55.29 శాతం తగ్గి రూ. 36.9 వేల కోట్లకు చేరుకున్నాయి. అలాగే, బంగారం దిగుమతి 77.42 శాతం తగ్గి రూ. 4,565 కోట్లకు చేరుకున్నాయి.