కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి

by  |
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్ :
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా ఖపోలీ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ప్రీవీ ఆర్గానిక్స్ కెమికల్ ప్లాంటులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.



Next Story