క్షుద్రపూజల కలకలం.. యువతిని అర్ధనగ్నంగా కూర్చోపెట్టి..

by  |
witchcraft cases
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల మూఢనమ్మకాలను కొంతమంది కేటుగాళ్లు డబ్బు చేసుకొంటున్నారు. క్షుద్ర పూజల పేరిట ప్రజలను నమ్మించి నిలువునా దోచేస్తున్నారు. తాజాగా క్షుద్ర పూజల పేరిట ఓ యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తూ వీడియోలు తీసి, ఆమెను బెదిరించి డబ్బు గుంజుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. గుంటూరులోని శారదానగర్‌ కాలనీలో నివాసం ఉండే వినుకొండ సుబ్బారావు, వినుకొండ శివపార్వతిలు క్షుద్ర పూజలు నిర్వహిస్తుంటారు. తాంత్రిక శక్తులను పోగొడతామని ప్రజలను నమ్మించి వారి నుంచి డబ్బు తీసుకొంటారు. ఈ నేపథ్యంలోనే గూడూరు మండలానికి చెందిన ఓ యువతికి ఎవరో తాంత్రిక పూజలు జరిపారని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో.. దానికి పూజలు చేసి నయం చేస్తామని నమ్మించారు. ఇక ఇదంతా నిజమేంనని నమ్మిన తల్లిదండ్రులు కూతుర్ని వారి వద్దకు పంపారు.

అనంతరం యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తూ వీడియోలు చిత్రీకరించారు. తర్వాత ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని యువతి తల్లిదండ్రులను బెదిరించడం ప్రారంభించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను నిఘా వేసి పట్టుకున్నారు. మాయలు మంత్రాలూ తెలుసని, మంత్రాలతో రోగాలు నయం చేస్తామని ఎవరైనా మాయమాటలు చెప్తే నమ్మవద్దని ప్రజలకు, పోలీసులు సూచించారు.



Next Story