పిల్లల ఆరోగ్యంతో చెలగాటం.. అంగన్‌వాడీ కేంద్రాల్లో కాలం చెల్లిన సరుకులు

by  |
పిల్లల ఆరోగ్యంతో చెలగాటం.. అంగన్‌వాడీ కేంద్రాల్లో కాలం చెల్లిన సరుకులు
X

దిశ, రామారెడ్డి : చిన్న పిల్లలకు పౌష్టికాహార లోపం రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలలో నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాయి. వేలాది రూపాయలు వెచ్చించి అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ చేస్తున్నాయి. కానీ.. వాటిని పక్కదోవ పట్టించి వాటి స్థానంలో నాసిరకం సరుకులు ఇస్తూ పిల్లల ఆరోగ్యంతో కొంత మంది ఆటలాడుతున్నారు.

ఈ దారుణ ఘటన మంగళవారం రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో చోటుచేసుకుంది. స్థానిక ప్రజలు, నాయకులు తెలిపిన సమాచారం ప్రకారం గ్రామంలో ఉన్న రెండు అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు పాడైన గుడ్లు, కాలం చెల్లిన పాలు అందిస్తున్నారని ఆరోపించారు. వాటిని పగులగొట్టి ప్రజలు.. అంగన్‌వాడీ టీచర్లను నిలదీశారు. మీ పిల్లలకు ఇలాంటి ఆహారం అందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed