గుట్టుగా మద్యం తరలింపు.. వైన్‌షాప్ సీజ్

by  |

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్‌లో నిబంధనలకు విరుద్ధంగా రాత్రుళ్లు గుట్టుచప్పుడు కాకుండా మద్యం తరలిస్తుండటంతో వైన్స్‌‌షాప్‌ను ఎక్సైజ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఎక్సైజ్ సీఐ రాధకృష్ణ వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలోని వైన్స్ నుంచి మద్యం అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు షాపును తనిఖీ చేయగా స్టాక్‌లో తేడా ఉండటం గుర్తించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వైన్స్‌ను సీజ్ చేసినట్టు తెలిపారు.

Tags: Nizamabad,Wine shop,exicise,seize,lockdown



Next Story

Most Viewed